విశ్వగురు వరల్డ్ రికార్డ్స్​ ఉగాది పురస్కారాలు ప్రదానం

విశ్వగురు వరల్డ్ రికార్డ్స్​ ఉగాది పురస్కారాలు ప్రదానం

పంజాగుట్ట, వెలుగు: పురస్కారాలు అందించి ప్రోత్సహిస్తే విధుల్లో మరింత క్రమశిక్షణతో పని చేస్తారని జస్టిస్​  శ్రీసుధ పేర్కొన్నారు. ‘ విశ్వగురు వరల్డ్ ​రికార్డ్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ఆదివారం గ్రీన్​లాండ్స్​లోని హోటల్​ టూరిజం ప్లాజాలో జరిగిన ప్రోగ్రామ్ లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన కళాకారులు, విద్యావేత్తలు, వైద్యరంగ నిపుణులకు ఉగాది పురస్కారాలను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో  మాజీ ఐఏఎస్​ లక్ష్మీకాంతం, పాఠశాల విద్య జాయింట్​ డైరెక్టర్ ​ మదన్​మోహన్, పారిశ్రామిక వేత్త ఆర్క్​గ్రూప్​ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.