బ్రదర్స్ అదుర్స్​..చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్ విజయం

బ్రదర్స్ అదుర్స్​..చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్ విజయం
  • నల్గొండ, మునుగోడులో కోమటిరెడ్డి సోదరుల విజయం
  • ఉత్తమ్​కుమార్​రెడ్డి దంపతుల విక్టరీ
  • మల్లారెడ్డి, ఆయన అల్లుడు గెలుపు

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కాకా వెంకటస్వామి కుమారులు ఇద్దరు డాక్టర్​గడ్డం వివేక్​వెంకటస్వామి చెన్నూరు నుంచి, గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నల్గొండ, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి  మునుగోడు నుంచి గెలిచారు. కాంగ్రెస్​సీనియర్​నేత ఉత్తమ్​కుమార్​రెడ్డి (హుజూర్​నగర్), ఆయన సతీమణి పద్మావతి (కోదాడ).. వారి సమీప బంధువు పాడి కౌశిక్​రెడ్డి (బీఆర్ఎస్​- హుజూరాబాద్) ఎమ్మెల్యేలుగా గెలిచారు. బీఆర్ఎస్​చీఫ్​కేసీఆర్​గజ్వేల్​నుంచి విజయం సాధించగా, కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆయన కుటుంబం నుంచి కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్​రావు (సిద్దిపేట) విజయం సాధించారు. మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్​రెడ్డి మల్కాజిగిరి నుంచి విజయం సాధించారు.

మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పాలకుర్తి నుంచి, ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్​రావు వరంగల్ ఈస్ట్ నుంచి ఓడిపోగా, ఎర్రబెల్లి అల్లుడు మదన్​మోహన్​రావు ఎల్లారెడ్డి నుంచి విజయం సాధించారు. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఓడిపోయినా ఆయన తనయుడు రోహిత్​మెదక్​నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఎస్పీ స్టేట్​చీఫ్​డాక్టర్​ఆర్.ఎస్. ప్రవీణ్​కుమార్ సిర్పూర్ నుంచి, ఆయన సోదరుడు ప్రసన్న కుమార్​అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్​నుంచి వికారాబాద్ లో పోటీ చేసిన వారి బావ డాక్టర్​మెతుకు ఆనంద్ ఓటమి పాలయ్యారు. హుస్నాబాద్​నుంచి బీఆర్ఎస్ పోటీ చేసిన వొడితెల సతీశ్​కుమార్, హుజూరాబాద్​నుంచి కాంగ్రెస్​అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడి కుమారుడు వొడితెల ప్రణవ్​ఓటమి పాలయ్యారు.