పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలి

పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలి

పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కోరారు. కూకట్పల్లిలోని  బండి సంజయ్ పాదయాత్ర శిబిరానికి వెళ్లిన  ఆయన ఈ అంశంపై చర్చించారు.  ఇటీవల పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గద్దర్ వినతిని  బండి సంజయ్ కేంద్రానికి పంపారు. 

కేపీహెచ్బీ కమ్యూనిటీ సెంటర్ నుంచి మూడో రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. శేష గ్రాండ్ హోటల్, రెయిన్బో విస్టాస్, అంజయ్య నగర్, చిత్తారమ్మ ఆలయం, మూసాపేట, భరత్ నగర్ అండర్ బ్రిడ్జి, జింకలవాడ, దీన్ దయాల్ నగర్, పైపులైను రోడ్డు, శోభనా థియేటర్ మీదుగా బాల్నగర్ గ్రామం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. వీఆర్ఏలపై పోలీసుల లాఠీచార్జ్ ను నిరసిస్తూ నల్లబ్యాడ్జిలు ధరించి పాదయాత్ర చేపట్టారు.