కేసీఆర్ కు రాజ్యాంగం, కోర్టులంటే గౌరవం లేదు

కేసీఆర్ కు రాజ్యాంగం, కోర్టులంటే గౌరవం లేదు

సీఎం కేసీఆర్ కు రాజ్యాంగం, కోర్టులంటే గౌరవం లేదన్నారు బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి. ఆర్టీసీ సమస్యపై మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు లేనిదే ఇవాళ తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు . నాగర్ కర్నూల్ లో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో వివేక్ పాల్గొన్నారు. మోడీ బొమ్మ పెట్టాల్సి వస్తుందని… కేంద్ర పథకాలనే అమలు చేయని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.