రఘునందన్ పై కేసు పెట్టడం సిగ్గుచేటు

రఘునందన్ పై కేసు పెట్టడం సిగ్గుచేటు

ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టడాన్ని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి ఖండించారు. మైనర్పై అఘాయిత్యం ఘటనలో నిందితులపై కేసులు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలంటూ ఒక బాధ్యత కల్గిన ఎమ్మెల్యే,అడ్వకెట్గా  ఉద్యమిస్తున్న  రఘునందన్ రావుపై కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. అఘాయిత్య ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా.. దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని వివేక్ వెంకటస్వామి   ప్రశ్నించారు.  పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి.. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తప్పు చేశారని తెలిసినా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ధర్మాన్ని అణిచివేస్తూ.. అధర్మం వైపు నడుస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.