ఘనంగా ప్రారంభమైన జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు 

ఘనంగా ప్రారంభమైన జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు 

హైదరాబాద్: ప్రధాని మోడీ క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి  అన్నారు. ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా LB స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి గేమ్స్ నిర్వహిస్తున్న భారత్ వ్యాంశాల స్పోర్ట్స్ చారిటబుల్  ట్రస్టు, ఏవీ ఇఫ్రాకన్  సంస్థలను ఆయన అభినందించారు.

తరుచూ క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో గెలిచినా.. ఓడినా ఒకేలా  తీసుకోవాలని సూచించారు. మూడు రోజులపాటు జరుగుతున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రెజ్లింగ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు.  కార్యక్రమంలో బీజేపీ నేతలు, క్రీడాకారులు పాల్గొన్నారు.