చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నా మనం చాలా స్ట్రాంగ్

చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నా మనం చాలా స్ట్రాంగ్

మంచి పాలన కోసం ప్రధాని మోడీ తాపత్రయపడేవారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... మోడీ జనం కోసం జన్ ధన్ అకౌంట్లు తెచ్చారన్నారు. మోడీ మోస్ట్ పాపులర్ నాయకుడన్నారు. కరోనా సమయంలో మోడీ పేదలకు ఇబ్బంది లేకుండా చేశారన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో మన పిల్లలను సేఫ్ గా తెచ్చారన్నారు.

చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నామన్నారు.పేదల వైద్యం కోసం  ఆయుష్మాన్ భారత్ తెచ్చారన్నారు. కానీ మోడీ ఫోటో పెట్టాల్సి వస్తదని కేసీఆర్ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు.  మిషన్ భగీరథ స్కీంలో జరిగినంత అవినీతి ఎక్కడా జరగలేదన్నారు. కేంద్ర పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే ఈ పోరాటమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు.