దళితులపై కోపంతోనే రాజ్యాంగం మార్చాలంటున్నరు

దళితులపై కోపంతోనే రాజ్యాంగం మార్చాలంటున్నరు


దళితులపై కోపంతోనే కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటున్నారన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. అంబేడ్కర్ జయంతి, వర్దంతికి ఏనాడు సీఎం నివాళులర్పించలేదన్నారు. ఎన్నికల కోసమే దళితబంధు డ్రామాలాడన్నారు. దళితులకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో 25 శాతం కన్నా ఎక్కువ.. ఒక్క మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ కు  కేటాయించారన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన కొనసాగుతుందన్నారు.