శ్రీ హరిహర ఆలయంలో వివేక్ వెంకటస్వామి పూజలు

శ్రీ హరిహర ఆలయంలో  వివేక్ వెంకటస్వామి  పూజలు

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం శ్రీ హరిహర దేవస్థానం స్థాపించి 20 వసంతాలు పూర్తవడంతో ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే హోమంలో పాల్గొన్నారు. సుప్రభాత సేవ, రుద్రహోమం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, మహా పూర్ణాహుతి పూజల్లో వివేక్ వెంకట స్వామి పాల్గొన్నారు. వేద పండితులు వివేక్ కు ఘనంగా స్వాగతం పలికారు. తరువాత అయ్యప్ప భక్తులు వివేక్ వెంకటస్వామిని సత్కరించారు.