కౌలు రైతు రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

కౌలు రైతు రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కమ్మల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో పత్తి పంట ముంపునకు గురి కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు కౌలు రైతు రాజేష్. 9 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేసిన రాజేష్ .. రెండుసార్లు పంట మునిగి 10 లక్షల అప్పు కావడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముందు రైతుల గోడును శనివారం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు వివేక్ వెంకటస్వామి. ఇవాళ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు రాజేష్ కుటంబాన్ని పరామర్శించి.. ఆర్థికసాయం చేశారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి.