పీవీకి వివేక్ వెంకటస్వామి నివాళి

 పీవీకి వివేక్ వెంకటస్వామి నివాళి

చరిత్ర ఉన్నంత వరకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావును గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పీవీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. 

అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పీవీతో మా తండ్రిగారికి మంచి అనుబంధం ఉందన్నారు. చాలా సంవత్సరాలు ఇద్దరు కలిసి క్యాబినెట్ లో పని చేశారని తెలిపారు. రెవల్యూషన్ చట్టాలు ఇంప్లిమెంటేషన్ సమయంలో మా నాన్న గారు పీవీకి తోడు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం దేశం 3 మిలియన్ లతో ముందుకు వెళుతుందంటే దానికి కేవలం పీవీ నరసింహారావుగారే కారణమన్నారు.

దేశంలో పీవీ నర్సింహారావు ఎకనామిక్ రిఫామ్స్ తీసుకొచ్చారని కొనియాడారు. పీవీకి బీజేపీ ప్రభుత్వం సమున్నత స్థానం ఇస్తుందని చెప్పారు. ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. చరిత్ర ఉన్నంత వరకు పీవీని గుర్తుంచుకోవాలన్నారు వివేక్ వెంకటస్వామి.