విమర్శలు చేసే స్థాయి వివేకానందకు లేదు

విమర్శలు చేసే స్థాయి వివేకానందకు లేదు

 ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్లపై విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలన్నారు. ఆయన తాహతు ఏంటో తెలుసుకోవాలన్నారు. బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్న ఆయనకు రాజకీయ జీవితానికి సమాధి ఏర్పడినట్లేనని, 2014లో టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి.. రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు.

కానీ.. ఈటల రాజేందర్ మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగిందన్నారు. అలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడిని విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. మరోసారి టికెట్ రాదని ఎమ్మెల్యే వివేకానంద తెలుసుకున్న అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే వివేకానంద చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ఉద్యమ నేతలు వింటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన వ్యక్తివంటూ.. నీ వ్యక్తిత్వం ఏంటో కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు.