వీఆర్వోల వ్యవస్థలో మార్పులు చేయాలని ,కొత్త చట్టాలపై నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో VRO సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్.. ప్రభుత్వాన్ని తన ఆలోచన మార్చుకోవాలంటూ గతంలోనే పలు మార్లు విన్నవించారు.
ఈ విషయంపై ఆయన శనివారం శంషాబాద్ లో చినజీయర్ స్వామిని కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ను రద్దు చేయడమో లేక ఇతర శాఖల్లో కలపాలనో చూస్తున్నారని, ఆ నిర్ణయానికి తాము వ్యతిరేకమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని VRO లను కాపాడాలని, అందుకు మీ ఆశీస్సులు ఉండాలని చిన జీయర్ ను సతీష్ కోరారు.