హెబ్బా పటేల్, కార్తీక్ రత్నం, కామ్నా జఠ్మలానీ, సంపత్ రాజ్ లీడ్ రోల్స్లో ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘వ్యవస్థ’. ఈ నెల 28 నుంచి జీ5లో స్ట్రీమ్ కానుంది. గురువారం ఈ సిరీస్ ట్రైలర్ను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేసి టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పాడు. న్యాయ వ్యవస్థ నేపథ్యంలో దీన్ని రూపొందించారు.
హత్య కేసులో ఇరుక్కున్న హెబ్బా పటేల్ కేసును వాదించే యంగ్ లాయర్గా కార్తీక్ రత్నం నత్తి ఉన్న క్యారెక్టర్ చేయగా, న్యాయ వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే విలన్ పాత్రలో సంపత్ రాజ్ కనిపిస్తున్నాడు. ‘తడబడేది నా మాటలే కానీ.. ఆలోచనలు కాదు నాన్న’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తానికి ట్రైలర్తో సిరీస్పై ఆసక్తిని పెంచారు మేకర్స్. గోపీచంద్ ‘రణం’ సినిమాలో హీరోయిన్గా నటించిన కామ్నా జెఠ్మలానీ చాలా గ్యాప్ తర్వాత ఈ సిరీస్తో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది.