‘వ్యూహం’ రెండో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

‘వ్యూహం’ రెండో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

ఏపీ సీఎం వైఎస్‌‌‌‌‌‌‌‌ జగన్‌‌‌‌‌‌‌‌ రాజకీయ జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. జగన్‌‌‌‌‌‌‌‌గా అజ్మల్, భారతిగా మానస నటించారు. దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈనెల 29న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రెండో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే.. మా సినిమాను థియేటర్స్‌‌‌‌‌‌‌‌కు రాకుండా అడ్డుకోలేరు.

వైఎస్‌‌‌‌‌‌‌‌ మరణం నుంచి మొదలై జగన్ అరెస్ట్, పార్టీ పెట్టడం, వైఎస్‌‌‌‌‌‌‌‌ వివేక హత్య వరకూ పలు ఘటనలు ఇందులో ఉంటాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌లను పోలిన పాత్రలు ఉంటాయి. అయితే వాళ్లకు ఈ పాత్రలకు సంబంధం లేదు. ప్రజలకు తెలియని ఇన్‌‌‌‌‌‌‌‌సైడ్ విషయాలను నాకు అర్థమైన కోణంలో ఇందులో చూపించాను’ అన్నారు. నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ ‘దేవుడు లోక కళ్యాణం కోసం కొన్ని పనులను కొందరి చేత చేయిస్తాడు. అలా నాతో ఈ సినిమా చేయించాడని భావిస్తున్నాను’ అని చెప్పారు.