అమెరికా, చైనా టారిఫ్​​ వార్​కు 90 రోజులు బ్రేక్​

అమెరికా, చైనా టారిఫ్​​ వార్​కు 90 రోజులు బ్రేక్​
  • స్విట్జర్లాండ్‌‌‌‌ వేదికగా జరిగిన చర్చల్లో ఇరు దేశాల నిర్ణయం
  • 115 శాతం సుంకాల తగ్గింపు కోసం అంగీకారం

అమెరికా, చైనా మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న టారిఫ్ వార్​కు తాత్కాలికంగా బ్రేక్​పడింది. పరస్పరం విధించుకున్న ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు వాయిదా వేసేందుకు సోమవారం స్విట్జర్లాండ్​లోని జెనీవాలో జరిగిన ఇరు దేశాల ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాయి. చర్చల ద్వారా ట్రేడ్​ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. 

స్విట్జర్లాండ్​లోని జెనీవాలో సోమవారం ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమై చర్చించారు. 115 శాతం వరకు టారిఫ్​లను తగ్గించుకోవాలని నిర్ణయించారు. చైనా ఉత్పత్తులపై అమెరికా 145 శాతం టారిఫ్​ వేస్తుండగా.. అందులో 115 శాతం తగ్గించింది. అంటే చైనాపై అమెరికా వేసే టారిఫ్​లు 30 శాతానికి పరిమితం కానున్నాయి. ఇక, అమెరికా ఉత్పత్తులపై చైనా 125 శాతం టారిఫ్​ వేస్తుండగా.. దాన్ని 115 శాతం తగ్గించింది. అంటే అమెరికా ఉత్పత్తులపై చైనా వేసే టారిఫ్​లు 10 శాతానికి పరిమితం కానున్నాయి. ఈ ఒప్పందం 90 రోజుల పాటు అమలులో ఉంటుందని ఇరు దేశాల ప్రతినిధులు ప్రకటించారు. 

వాస్తవానికి.. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ట్రంప్​ చైనాతో టారిఫ్​ వార్ మొదలుపెట్టారు. చైనా ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు విధించారు. ఇందుకు ప్రతిగా చైనా కూడా అదే స్థాయిలో టారిఫ్​లు వేయసాగింది. దీంతో ప్రపంచ మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేశాయి. 

ఎట్టకేలకు దిగివచ్చిన ఇరు దేశాలు ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడం, 90 రోజుల వరకు అది అమలులో ఉంటుందని ప్రకటించడం స్టాక్​ మార్కెట్లను ఖుషీ చేశాయి. ఈ పరిణామాలతో అటు అమెరికా స్టాక్​మార్కెట్లతో పాటు ఇండియా షేర్​ మార్కెట్​ కూడా భారీ స్థాయిలో లాభాల్లో దూసుకెళ్లాయి.