వైకల్యాన్ని అధిగమించినా .. క్రీడల్లో రాణించినా.. పేదరికం అడ్డుపడుతోంది!

వైకల్యాన్ని అధిగమించినా .. క్రీడల్లో రాణించినా..  పేదరికం అడ్డుపడుతోంది!
  • అంతర్జాతీయ పోటీలకు వరంగల్ క్రీడాకారుడు రాజశేఖర్ ఎంపిక 
  • భారత్ తరఫున వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేక దాతల కోసం ఎదురుచూపు 

నెక్కొండ, వెలుగు : చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు.  వైకల్యం వెంటాడినా నిరాశ చెందలేదు. చదువుతో పాటు ఇష్టమైన క్రీడలో పట్టు రాణించాడు.  త్రో బాల్ లో ఇండియా తరఫున ఆడి ప్రతిభ చూపాడు. ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ కు సెలెక్ట్ అయ్యాడు. అతడే.. వరంగల్​జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన మాంకాల రాజశేఖర్.

గత డిసెంబర్ లో  శ్రీలంకలో జరిగిన సౌత్ ఏషియన్​ పారాత్రోబాల్​లో ఇండియా జట్టు తరఫున పాల్గొని ప్రతిభ చూపి సిల్వర్​మెడల్​సాధించాడు. వచ్చే నెల14 నుంచి 18 వరకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో నిర్వహించే ఇంటర్నేషనల్ పారాత్రోబాల్​చాంపియన్ షిప్ కు సెలక్ట్  అయ్యాడు. 2024లో రాజస్థాన్​లోని జైపూర్​లో జరిగిన పారాసిట్టింగ్​వాలీబాల్ పోటీలోనూ జాతీయస్థాయిలో పాల్గొని షటిల్, అథ్లెటిక్స్ క్రీడల్లో గోల్డ్​మెడల్​సాధించాడు.

ఇప్పుడు ఇంటర్నేషనల్  పారా త్రోబాల్​లో గేమ్​ఆడేందుకు చాన్స్ వచ్చినా ఆర్థిక స్తోమత లేదు. పేదింట్లో పుట్టిన రాజశేఖర్​పీజీ వరకు చదివాడు. క్రీడల్లోనూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా పేదరికం అడ్డుపడుతోంది. ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ టోర్నమెంట్​కు వెళ్లేందుకు ఆర్థికసాయం అందించే దాతల కోసం ఎదురు చూస్తున్నాడు.