మిర్చి ధరలు తగ్గుతున్నాయి : బొమ్మినేని రవీందర్​రెడ్డి

మిర్చి ధరలు తగ్గుతున్నాయి : బొమ్మినేని రవీందర్​రెడ్డి
  •     ఛాంబర్ ​ఆఫ్ ​కామర్స్ ​ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్​రెడ్డి 

కాశీబుగ్గ, వెలుగు: మిర్చి పంటకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయని వరంగల్​ఛాంబర్​ఆఫ్ కామర్స్​ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్​రెడ్డి తెలిపారు. సోమవారం వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రస్తుతం మిర్చి రైతులు ధరలు తగ్గుతున్నాయన్నారు. మిర్చి రైతులు కోల్డ్ స్టోరేజీల్లో, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పంటను నిల్వ చేసుకోవాలని సూచించారు.

ఏనుమాముల మార్కెట్​కు భారీగా మిర్చి పంట వచ్చినా రెండేండ్లుగా మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు. ఏనుమాముల మార్కెట్​కు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, కాగజ్​నగర్, మంచిర్యాల, చెన్నూరు, మహబూబ్​నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ తదితర జిల్లాల నుంచి మిర్చి వస్తుందని తెలిపారు.

ఇక్కడి వచ్చిన మిర్చి చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, థాయ్​లాండ్, మలేషియా వంటి దేశాలకు ఎక్స్​ఫోర్టు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధర లేకపోవడంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మిర్చి రైతులు వ్యాపారులు ఇబ్బంది పెట్టవద్దని కోరారు.