గ్రేటర్ వరంగల్, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద సూచించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితంగా పూర్తి చేయాలంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలన్నారు. అనంతరం అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో విద్యార్థులు వివిధ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను కలెక్టర్ సందర్శించారు.
