రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత : డీసీపీ అంకిత్కుమార్

 రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత :  డీసీపీ అంకిత్కుమార్
  • వరంగల్ ​ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్​కుమార్​

నర్సంపేట, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వరంగల్ ఈస్ట్​జోన్ డీసీపీ అంకిత్​కుమార్​కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం నర్సంపేట టౌన్​లోని రోడ్ సేఫ్టీపై బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ వాహనాలు అజాగ్రత్తగా నడపడం వల్లే ఆక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. బైక్​నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ రూల్స్​ను పాటించాలన్నారు. కార్యక్రమంలో టౌన్​సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి, ఎస్సైలు అరుణ్​కుమార్, రవికుమార్​ తదితరులు పాల్గొన్నారు.

రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలి 

తొర్రూరు, వెలుగు : వాహనదారులు రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలని తొర్రూరు డీఎస్పీ క్రిష్టకిశోర్ తెలిపారు. గురువారం మహబూబాబాద్​జిల్లా తొర్రూరులో రోడ్ సేఫ్టీలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్మించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ వాహనాలు, సరైన ధృవపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారుతుల తప్పకుండా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలన్నారు.