కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి

 కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి

బస్సు ఎక్కే ప్రయత్నంలో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి  చెందాడు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన లక్ష్మణ్ (55)  తన కుటుంబ సభ్యులతో కలిసి హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాడు.  

కొండ దిగువ నుంచి భక్తులను ఆలయానికి చేర్చేందుకు అధికారులు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. బస్సు ఎక్కబోయిన లక్ష్మణ్ ప్రమాదవాశాత్తు బస్సు కింద పడటంతో రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. అంబులెన్స్ కి కాల్ చేయగా ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకుంది. అతడిని కరీంనగర్ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.