గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కు అని వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఛత్తీస్గడ్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి పేషెంట్లు వస్తుంటారని అన్నారు.
ఇటీవల సిటీ స్కానింగ్ పరికరం సరిగా పని చేయకపోవడంతో సుమారు 30 మంది రోగులను హైదరాబాద్ నిమ్స్ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అధికారులతో మాట్లాడి ఉపశమనం కల్పించినప్పటికీ భవిష్యత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మరింత అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు సమస్యల పై ఆయన ప్రస్తావించారు.
