జనగామ అర్బన్/ గ్రేటర్ వరంగల్/ ములుగు, వెలుగు: దేశ మొదటి విద్యాశాఖ మంత్రి దివంగత అబుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జయంతి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నివాళులర్పించారు. వరంగల్ కలెక్టరేట్ లో, సిటీలోని రంగశాయిపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో కలెక్టర్ సత్య శారద నివాళులర్పించారు. ములుగు కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవంలో భాగంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ దివాకర పూలమాలవేసి నివాళులర్పించారు.
జనగామ జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపాల్ పోతు అనిల్బాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్ కలాం ఫొటోకు నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
