
ఫస్టియర్ టాపర్,
సెకండ్ ఇయర్ ఫెయిల్
కాజీపేట, వెలుగు: వరంగల్లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో బిటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న కౌశిక్ పాండే (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోల్కతాలోని అవద్ ప్రాంతానికి చెందిన కౌశిక్ పాండే వరంగల్నిట్ లో ఈ సీఈ బ్రాంచ్ లో చేరాడు. ఫస్టియర్లో టాపర్గా నిలిచాడు. సెకండ్ ఇయర్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సు ఎంచుకున్నాడు. ఫస్ట్ సెమిస్టర్ లో రెండు సబ్జెక్టులు ఫెయిల్కావడంతో మనస్తాపంచెంది డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన అతడికి తండ్రి బీబ్ లాబ్ పాండే నచ్చచెప్పి తిరిగి తీసుకొచ్చాడు. ఈ నెల 1వ తేదీన బీటెక్ థర్డ్ ఇయర్ లో చేర్పించాడు. కొడుకు డిప్రెషన్ లో ఉన్నందున పాండే వారం రోజులు వరంగల్ లోనే ఉన్నాడు. బిజినెస్పనులపై ఒంగోలు వెళ్లిన పాండే బుధవారం మధ్యాహ్నం నిట్ వచ్చాడు. ఫోన్చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ కు వెళ్లాడు. హాస్టల్ రూమ్తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా కౌశిక్ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.