ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిబద్ధతలో విధులు నిర్వహించాలి : కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌

 ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిబద్ధతలో విధులు నిర్వహించాలి : కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌

 వర్ధన్నపేట, వెలుగు: ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన వర్ధన్నపేట పీఎస్​ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసలు గౌరవ వందనం స్వీకరించి, పరేడ్,  కిట్​ ఆర్టికల్స్​ను పరిశీలించారు.

రిసెప్షన్‌, సీసీటీఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరుపై ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించి, పెండింగ్​ కేసులు, దర్యాప్తులో ఉన్న వాటి గురించి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. తనిఖీల్లో వెస్ట్ జోన్‌ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సైలు సాయిబాబు, రాజు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా వర్ధన్నపేట కొనారెడ్డి చెరువును సీపీ అధికారులతో కలిసి పరిశీలించారు. తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.