సెక్రటరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్​ఇప్పుడు పొలంబాట పట్టారు : కేఆర్‍.నాగరాజు

సెక్రటరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్​ఇప్పుడు పొలంబాట పట్టారు : కేఆర్‍.నాగరాజు

వరంగల్‍/హనుమకొండ సిటీ, వెలుగు: పదేండ్ల పాలనలో సెక్రటేరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్​ ఇప్పుడు పొలం బాట పట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు ఎద్దేవా చేశారు. సోమవారం హనుమకొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో మాట్లాడుతూ కేసీఆర్‍ నిద్రలేచిన ఫాంహౌజ్‍ కుంభకర్ణుడని,  కూతురు కవిత జైల్‍కు వెళ్లడంతో మతిస్థిమితం తప్పిండని అన్నారు.

కేసీఆర్‍ కాళేశ్వరం ప్రాజెక్ట్​‍ను ఏటీఎం మిషన్‍ లెక్క వాడుకున్నాడని ఆరోపించారు. రైతుల కన్నీళ్లకు కారకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డలో పిల్లర్లు కుంగి నీళ్ల పోయినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్​ వందల కోట్ల స్కామ్​ చేశారని, కాంగ్రెస్‍ ప్రభుత్వం దాన్ని బయటకు తీస్తుందని చెప్పారు. జనగామ జిల్లా దేవరుప్పుల పర్యటనలో కేసీఆర్‍ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాడని, ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్లు ఎందుకివ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు.

కేసీఆర్‍కు దమ్ము, ధైర్యముంటే చట్టసభల్లో మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్‍రెడ్డిని బీఆర్‍ఎస్‍ నేతలు గుంపుమేస్త్రీ అంటున్నారని, ఆయన కేసీఆర్‍ ప్రభుత్వ పాపాలు, లోపాలను సరిచేసే ముఠామేస్ర్తీ అంటూ చురకలంటించారు. ఈ ప్రెస్ మీట్ లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్​రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీసం సురేందర్ రెడ్డి, నిమ్మని శేఖర్ రావు, నాయకులు పాల్గొన్నారు.