మెల్బోర్న్: ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీమ్ను సెలెక్టర్లు బుధవారం ప్రకటించారు. ఇండియాతో టెస్ట్ సిరీస్లో ఘోరంగా ఫెయిలైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టులో ప్లేస్ నిలబెట్టుకున్నాడు. మొత్తం 17 మందితో కూడిన టీమ్లో ఉస్మాన్ ఖవాజతో పాటు మార్కస్ హారిస్, మాథ్యూ రెన్షా కూడా చోటు దక్కించుకున్నారు.
2019 తర్వాత మళ్లీ మిచెల్ మార్ష్కు పిలుపు అందింది. ఇక జూన్ 7న లండన్లో ఇండియాతో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఈ టీమ్లో నుంచి 15 మందిని ఎంపిక చేస్తారు. జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ మొదలవుతుంది. తొలి రెండు టెస్ట్ల తర్వాత పెర్ఫామెన్స్ను బట్టి టీమ్లో మార్పులు చేస్తామని సెలెక్టర్లు తెలిపారు.