కెరీర్‌‌‌‌ చివరి టెస్టు సిరీస్‌‌లో వార్నర్ సెంచరీ

కెరీర్‌‌‌‌ చివరి టెస్టు సిరీస్‌‌లో వార్నర్ సెంచరీ

పెర్త్: కెరీర్‌‌‌‌లో చివరి టెస్టు సిరీస్‌‌ ఆడుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (164) భారీ సెంచరీతో చెలరేగడంతో గురువారం పాకిస్తాన్‌‌తో మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఆసీస్‌‌ తొలి రోజు ఆట చివరకు  346/5 స్కోరు చేసింది.

వార్నర్‌‌‌‌కు తోడు ఉస్మాన్ ఖవాజా (41), ట్రావిస్ హెడ్ (40), స్టీవ్ స్మిత్ (31) రాణించారు.  పాక్ బౌలర్లలో ఆమెర్ జమల్ రెండు, షాహీన్ ఆఫ్రిది, ఫహీమ్ అష్రఫ్, ఖుర్రం షహజాద్ ఒక్కో వికెట్ తీశారు. మిచెల్ మార్ష్ (15 బ్యాటింగ్‌‌), అలెక్స్‌‌ క్యారీ (14 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.