శాయంపేట, వెలుగు: పని కోసం హనుమకొండకు వలస వెళ్లి వాచ్మెన్గా పనిచేసుకుంటున్న కుటుంబం అనూహ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలో జరిగింది. గ్రామానికి చెందిన మాధారం సరోజన సాంబయ్య తన రెండు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో కుటుంబపోషణ భారమై పనుల కోసం హనుమకొండకు వలస వెళ్లి వాచ్మెన్గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
గ్రామంలో ఉన్న సమయంలో రెండు సార్లు వార్డు మెంబర్గా పనిచేసిన అనుభవంతో ఈసారి గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో కాంగ్రెస్పార్టీకి చెందిన నాయకులు సరోజను సర్పంచ్గా పోటీ చేయాలని ప్రోత్సహించారు. దీంతో మూడు నెలల కింద తాము పనిచేసే వాచ్మెన్ పనులకు వేరేవారికి అప్పగించి, గ్రామానికి చేరుకుని ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాధారపు సరోజన 29 ఓట్లతో గెలుపొందారు. వాచ్మెన్ కుటుంబం సర్పంచ్ కావడంతో గ్రామస్తులు సరోజన సాంబయ్య దంపతులకు స్వీట్లు పెట్టి సంబురాలు చేసుకున్నారు.
