చదువుకోకపోయినా రూ.50 వేల ఉద్యోగం...!  వసతి, భోజనం ఫ్రీ.. బోనస్ కూడా అంటూ ఫేక్ ప్రచారం..నమ్మొద్దన్న వాటర్ బోర్డు  

చదువుకోకపోయినా రూ.50 వేల ఉద్యోగం...!  వసతి, భోజనం ఫ్రీ.. బోనస్ కూడా అంటూ ఫేక్ ప్రచారం..నమ్మొద్దన్న వాటర్ బోర్డు  

హైదరాబాద్​సిటీ, వెలుగు : ‘హైదరాబాద్​నీటి సరఫరా బోర్డు, తెలంగాణ రిక్రూట్​మెంట్​బోర్డు 2026 ..ఎలాంటి పరీక్ష లేకుండా వాక్​ఇన్​ఇంటర్వ్యూలతో డైరెక్ట్​ రిక్రూట్​మెంట్’​అంటూ ఓ ఫేక్​ప్రకటన సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సెక్యూరిటీ గార్డు, ఆఫీస్​అటెండెంట్​, సహాయక సిబ్బంది కావాలని, జీతం రూ.33, 500 నుంచి 52800 వరకు ఉంటుందని కేటుగాళ్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  8వ తరగతి, 10, 12 పాసై ఉండాలని, అస్సలు చదువు లేకపోయినా ఉద్యోగాలిచ్చేస్తామని మెన్షన్​చేశారు. 

పైగా,  వసతి, భోజనం, బోనస్​లు కూడా ఉంటాయని ఊదరగొట్టేశారు. ఉద్యోగాలు కావాలంటే లింక్​పై క్లిక్​ చేయాలని కోరారు. ఇది సోషల్​మీడియాలో తిరుగుతుండడంతో గుర్తించిన వాటర్​బోర్డు అధికారులు ఈ ప్రకటనను నమ్మవద్దని ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాలు ఉంటే టీజీపీఎస్​సీ ద్వారానే ప్రకటనలు వస్తాయని తెలిపారు.