
- 1.08 లక్షల మ్యాన్హోళ్ల పూడికతీత
- 10,105 క్యూబిక్మీటర్ల పూడిక తొలగింపు
- 3.5 లక్షల మ్యాన్హోళ్ల క్లీనింగే వాటర్బోర్డు లక్ష్యం
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ను వచ్చే వర్షాకాలం నాటికి ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చేందుకు వాటర్బోర్డు అధికారులు నడుం బిగించారు. అందులో భాగంగా నెల రోజుల నుంచి అమలు చేస్తున్న 90 రోజుల స్పెషల్డ్రైవ్కార్యక్రమాన్ని మరింత స్పీడప్చేయాలని నిర్ణయించారు. దీనికోసం వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి రెండు రోజుల కింద సమావేశం పెట్టి ఆదేశాలు జారీ చేశారు.
1,450 చదరపు కిలోమీటర్ల పరిధిలోని మురుగునీటి పైప్లైన్లను 30 ఏండ్లుగా క్లీన్చేయకపోవడం వల్ల మ్యాన్హోళ్లు, ట్రంక్మెయిన్స్ వంటివి పూడుకుపోయాయని, దీంతో చిన్న వర్షం పడినా ఓవర్ఫ్లో అవుతున్నాయన్నారు. వచ్చే వర్షాకాలంలో ఈ సమస్య ఉండకుండా చేయాలన్నారు. ఇప్పటి వరకూ 1,395 కిలోమీటర్ల పరిధిలో 1.08 లక్షల మ్యాన్హోళ్లను క్లీన్చేశామని, ఏండ్ల తరబడి పేరుకుపోయిన10,105 క్యూబిక్మీటర్ల పూడికను తొలగించామన్నారు.
90 రోజుల ప్లాన్లో భాగంగా 3.5 లక్షల మ్యాన్హోల్స్ను పూడిక తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పనుల నిర్వహణకు 144 సీవరేజీ డీసిల్టింగ్వాహనాలను వినియోగిస్తున్నామని, రాబోయే రోజుల్లో రోజుకు కనీసం10వేల మ్యాన్హోళ్లలో పూడిక తీసి శుభ్రం చేయాలని టార్గెట్పెట్టుకున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త లైన్ల ఏర్పాటును మరో 11 కిలోమీటర్లు పెంచాలని నిర్ణయించారు.