శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు విడుదల

శ్రీశైలం నుంచి  పోతిరెడ్డిపాడుకు నీళ్లు విడుదల

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు   శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు.   తెలంగాణ ప్రభుత్వం కరెంట్ పేరుతో ఏపీకీ రావలసిన నీటిని  అక్రమంగా 42 వేల క్యూసెక్కులను తీసుకుంటుందని ఎమ్మెల్యే శిల్పా  చక్రపాణి ఆరోపించారు.  కేఆర్ బీఎంబీ కేటాయించిన నీటి వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.  తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వైషమ్యాలకు పోకుండా ఎవరి వాటా ప్రకారం వారు వాడుకోవాలన్నారు.

ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను దివగంత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయిందని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి అన్నారు.  అయితే చంద్రబాబు తామే పూర్తిచేశామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు  నీటిని వాడుకునే అవకాశం  లేకుండా చంద్రబాబు చేశారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు.