వాటర్​ ట్యాంక్​ బ్లాస్ట్.. రైల్వే స్టేషన్​లో ప్రయాణికులకు గాయాలు

వాటర్​ ట్యాంక్​ బ్లాస్ట్..  రైల్వే స్టేషన్​లో ప్రయాణికులకు గాయాలు

వాటర్​ట్యాంక్​ పై నుంచి కింద పడటంతో పలువురు గాయాలపాలయిన ఘటన వరంగల్​ రైల్వే స్టేషన్​లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 14న వరంగల్​రైల్వేస్టేషన్లోని ఒకటో నంబర్​ప్లాట్ పక్కన ఉన్న బిల్డింగ్​ పై నుంచి వాటర్​ట్యాంక్ బ్లాస్ట్​అయి​ రేకులపై పడింది. 

అవి అక్కడే ఉన్న ప్రయాణికులపై పడటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొందరు నీటి ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకుపోయి రైల్వే ట్రాక్​పై పడ్డారు. ఆ సమయంలో రైలు వచ్చింటే ఘోర ప్రమాదం  జరిగేదని.. రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

క్షతగాత్రులను వరంగల్​ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.