మంత్ ఆఫ్ మధుపై నమ్మకంగా ఉన్నాం : నవీన్ చంద్ర

మంత్ ఆఫ్ మధుపై నమ్మకంగా  ఉన్నాం  : నవీన్ చంద్ర

నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా  శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా  అక్టోబర్ 6న విడుదల కానుంది. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. గెస్ట్‌‌గా హాజరైన సాయి ధరమ్  మాట్లాడుతూ ‘ఈ మూవీ టీమ్ అంతా నాకు మంచి స్నేహితులు. దర్శకుడు శ్రీకాంత్ ఇంతకుముందు తీసిన ‘భానుమతి అండ్ రామకృష్ణ’లో చాలా క్లిష్టమైన ఎమోషన్స్ ఉన్నాయి. ఇందులో కూడా అలాంటి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రంతో నవీన్‌‌, స్వాతిలకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. 

నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. మంచి కథ, రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సహా అన్ని బాగా కుదిరాయి’ అన్నాడు. ఈ చిత్రం చాలా సర్‌‌‌‌ప్రైజింగ్‌‌గా ఉంటుందని  చెప్పింది స్వాతి రెడ్డి. సినిమా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు దర్శక నిర్మాతలు. రాజారవీంద్ర, హర్ష, శ్రేయాతో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.