భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వైద్య సిబ్బంది, ఉద్యోగులు, డాక్టర్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి వారి సాధక బాధలను తెలుసుకుంటామని స్టేట్హెల్త్ డైరెక్టర్గడల శ్రీనివాసరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య సిబ్బంది, ఉద్యోగులతో రివ్యూ, ఆత్మీయ సమ్మేళనంలో శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,700 సబ్ సెంటర్లలో 1,500 పోస్టులు, 930 పీహెచ్సీలలో 756 డాక్టర్ల పోస్టులు, 1,500 ఏఎన్ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే సంవత్సరాల్లో మరో 9 మెడికల్కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆశాలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు వారి సమస్యలను హెల్త్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. హాస్పిటల్స్కు డెలివరీ కేసులను తీసుకువెళ్లిన టైంలో వాచ్మన్దగ్గర నుంచి డాక్టర్లు, స్టాఫ్ నర్సుల వరకు తమను అవమానపర్చేలా వ్యవహరిస్తున్నారని ఆశాలు వాపోయారు. కనీసం వాష్ రూంలను కూడా వాడుకోనివ్వడం లేదని పేర్కొన్నారు. స్పందించిన హెల్త్డైరెక్టర్హాస్పిటల్కు వెళ్లిన టైంలో ఆశాలకు ప్రత్యేక రూం ఇచ్చేలా చర్యలు చేపడ్తామన్నారు. ఆశాలకు కనీసం వేతనం ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి పాటలు పాడారు. సహపంక్తి భోజనాలు చేశారు.