మేం పార్టీ మారటం లేదు : ప్రెస్ మీట్ పెట్టిన ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

మేం పార్టీ మారటం లేదు : ప్రెస్ మీట్ పెట్టిన ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తాము పార్టీ మారడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారు.  నియోజక అభివృద్ధి కోసం సీఎంను, మంత్రులను కలవటం తమ బాధ్యతని చెప్పారు. తెలంగాణ భవన్ లో మీడియా నలుగురు ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశామని అన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. తమ కార్యకర్తలు కన్ఫ్యూజన్ లో ఉన్నారని అందుకే వివరణ ఇస్తున్నామని చెప్పారు. 

తమకు పార్టీ మారాల్సిన అవసరం లేదని సునితా లక్ష్మారెడ్డి చెప్పారు. పార్టీ మారతాం అని వస్తున్న కథనాలు తమకు బాధ కలిగిస్తుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వం పై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.  తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తే డిఫర్మేషన్ కూడా వేస్తామని తెలిపారు. 
కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కప్పదాటు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

నియోజక వర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. అందుకే ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో మెదక్ ఎంపీ సీటు గెలుస్తామని చెప్పారు. తమ పై  అధినాయకత్వానికి కూడా నమ్మకం ఉందని తెలిపారు.