ధరలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

ధరలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ఇన్​ఫ్లేషన్​ (ధరల భారం) ప్రస్తుతం ఆర్​బీఐ నిర్ణయించుకున్న పరిమితి 2–6 శాతం కంటే ఎక్కువగానే ఉందని, ధరలను తగ్గించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. తమ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించబట్టే ఇన్​ఫ్లేషన్​ ప్రస్తుతం ఆర్​బీఐ పరిమితి కంటే కొంచెమే ఎక్కువగా ఉందని అన్నారు. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ఈ ఏడాది మార్చి రిటైల్​ ఇన్​ఫ్లేషన్​ గత 15 నెలలతో పోలిస్తే బాగా నెమ్మదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్​ఫ్లేషన్​5.2 శాతం వరకు ఉండొచ్చని, ఇది ఆర్​బీఐ లిమిట్​కంటే ఎక్కువేనని వార్తా సంస్థ రాయిటర్స్​  నిర్వహించిన పోల్​ తెలిపింది. ధరలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్​బీఐ 2022 మే నుంచి రెపో  రేట్లను 250 బేసిస్​ పాయింట్లు పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్​ఇన్​ఫ్లేషన్​ 6.5 శాతం వరకు నమోదు కావొచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది. అయితే తాజాగా ఆర్​బీఐ మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ  రేట్లను మార్చలేదు.