రంజాన్ నాటికి ఈద్గా పనులు కంప్లీట్ చేస్తాం : సరిత

రంజాన్  నాటికి ఈద్గా పనులు కంప్లీట్  చేస్తాం : సరిత

గద్వాల, వెలుగు: గద్వాల పట్టణంలోని ఈద్గా పెండింగ్‌‌ పనులను వచ్చే రంజాన్  పండుగ నాటికి కంప్లీట్  చేస్తామని జడ్పీ చైర్​పర్సన్​ సరిత తెలిపారు. ఆదివారం ఆఫీసర్లు, మైనార్టీ లీడర్లతో కలిసి ఈద్గా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ.2.25 కోట్లు మంజూరు చేసినా, ఇప్పటికీ పనులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పనులు ముందుకు సాగలేదన్నారు. పనుల పెండింగ్  వివరాలను పీఆర్​ ఏఈ బషీర్ ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్  పనులను పూర్తి చేయాలని, అదనపు నిధులు​అవసరమైతే ప్రభుత్వం నుంచి తీసుకొస్తానన్నారు. బండ్ల రాజశేఖర్ రెడ్డి, శంకర్, మధుసూదన్ బాబు, ఇసాక్, యూసుఫ్  ఉన్నారు.