ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని… ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు తెలంగాణ జన సమితి (TJS) అధినేత కోదండరాం. రెండు రోజుల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా రెండు కమిటీలను ఏర్పాటు చేశామని, అందులో ఒకటి మేనిఫెస్టో కమిటీ, మరొకటి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కమిటీ అని చెప్పారు. ఈ రెండు కమిటీలు అందరి అభిప్రాయాలు తీసుకున్నాయని… ఆ తర్వాతనే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఓటర్ల లిస్టులో అవకతవకలు ఉన్నాయన్న కోదండరాం.. బోగస్ ఓటర్ల పేర్లు నమోదు చేశారని ఆరోపించారు.