అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం : రేవంత్ రెడ్డి

అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి. కమీషన్ల కోసమే కేసీఆర్ డిజైన్ మార్చారని ఆరోపించారు. ఆసిఫాబాద్ లో మాట్లాడిన ఆయన. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్ దే నన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు లు పూర్తి చేసింది.. యాభై లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పారు. ఇవాళ సాగునీటి పేరుతో దోపిడీ కోసం కోటి ఎకరాలని కేసిఆర్ మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే ప్రాజెక్టుల డీపీఆర్‌ను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం నిర్మాణాత్మక పోరాటం చేస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.