పిలగాడు ముంబైలో .. పిల్ల బరేలీలో.. జూమ్‌ యాప్‌లో పెండ్లి

పిలగాడు ముంబైలో .. పిల్ల బరేలీలో.. జూమ్‌ యాప్‌లో పెండ్లి
  • రాయ్‌పూర్‌‌ నుంచి పెండ్లి చేసిన పూజారి
  • ఆన్‌లైన్‌లోనే కన్యాదానం, బంధువుల ఆశీర్వాదాలు

ముంబై: సమ్మర్‌‌ సీజన్‌ వస్తే చాలు.. చాలా పెళ్లిలు జరుగుతాయి. ఫిబ్రవరి మొదలుకొని దాదాపు మే చివరి వరకు వేలల్లో పెళ్లిలు జరుగుతాయి. ఎండలు మండిపోతున్నా పట్టించుకోకుండా చాలా పెండ్లి అంటే పెద్ద పండగ అన్నట్లు చేస్తారు. కానీ ఈ ఏడాది వెడ్డింగ్‌ సీజన్‌ వెలవెల బోయింది. కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా చాలా పెళ్లిలు వాయిదా పడ్డాయి. అయితే పెళ్లిలు వాయిదా పడకూడదనే సెంటిమెంట్‌తో కొంత మంది సింపుల్‌గా, ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన సుషేన్‌ దంగ్‌, కీర్తీ నరాంగ్‌ తమ పెళ్లిని చాలా గ్రాండ్‌గా చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. దీని కోసం వైల్డ్‌లైఫ్‌ రిసార్ట్‌ను బుక్‌ చేశారు. అందులో కాక్‌టైల్‌ పార్టీలు, సంగీత్‌ పెట్టుకుని ఎంజాయ్‌ చేయాలనుకన్నారు. కానీ కరోనా వారి ఆశలను ఆవిరి చేసింది. లాక్‌డౌన్‌ వారి పెళ్లి సింపుల్‌గా ఆన్‌లైన్‌లో జరిగేలా చేసింది. సుషేన్‌ దంగ్‌, కీర్తీ నరాంగ్‌లు తమ జాతకం ప్రకారం పెళ్లి ముహూర్తం ఫిక్స్‌ చేయడంతో ఆ రోజున పెళ్లి జరిగితే చాలా మంచి జరుగుతుందని ఆన్‌లైన్‌లోనే పెళ్లి కానిచ్చారు. జూమ్‌ యాప్‌లో మీట్‌ అయిన అందరూ అక్కడే పెళ్లి తంతు ముగించారు. ముంబైలో ఉన్న సుషేన్‌ పెళ్లి దుస్తులు వేసుకుని కూర్చున్నాడు. పెళ్లి కూతురు సంప్రదాయ దుస్తుల్లో తన ఇంటి నుంచి జూమ్‌ యాప్‌లో కనెక్ట్‌ అయింది. రాయ్‌పూర్‌‌లో ఉన్న పూజారి యాప్‌ ద్వారా వధువు తండ్రితో కన్యాదానం చేయించి వారి పెళ్లి చేశారు. అంతే కాకుండా ఈ పెళ్లిక అతిథులు కూడా వచ్చారు. వాళ్లు కూడా జూమ్‌ యాప్‌లోనే పెళ్లిని చూసి జంటను ఆశీర్వదించారు. ఆ తర్వాత బాలీవుడ్‌ పాటలు పెట్టుకుని అందరూ డ్యాన్సులు చేస్తూ ఎవరింట్లో వాళ్లు ఎంజాయ్‌ చేశారు. “ మా పెళ్లి ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు” అని పెళ్లి కొడుకు చెప్పాడు.
చాలా డిజిటల్‌ పెళ్లిలు చేశాం
పెళ్లిల సీజన్‌లో ఈ లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రీ బాగా దెబ్బతినిందని నిర్వాహకులు చెప్తున్నారు. కోట్లలో ఖర్చు చేసుకుని గ్రాండ్‌గా జరగాల్సిన చాలా పెళ్లిలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని షాదీ.కామ్‌ సీఈవో అనుపమ్‌ మిట్టల్‌ అన్నారు. ఇలాంటి కష్టకాలంలో మేం వాళ్లకు హెల్ప్‌ చేస్తూనే ఉన్నామని, షాదీ.కామ్‌ ఇప్పటికే చాలా మందికి డిజిటల్‌ వెడ్డింగ్‌ చేసిందని, వాళ్లకు ఆన్‌లైన్‌ మేకప్‌, మెహందీ ప్రొఫెషనల్స్‌ను అరేంజ్‌ చేయడం, గెస్ట్‌లకు ఇళ్లకే ఫుడ్‌ పంపడం చేసిందని అన్నారు. మన దేశంలో పెండ్లి అనేది సోషల్‌ స్టేట్‌మెంట్స్‌ అని, పెళ్లి రెండు కుటుంబాల మధ్య కానీ ఇద్దరు వ్యక్తులు మధ్య కాదు కాబట్టి ఎప్పటికీ పెళ్లిలు గ్రాండ్‌గానే జరుగుతాయని మిట్టల్‌ చెప్పారు.