
రచయిత డాక్టర్ బోయ జంగయ్య రాసిన ‘అడ్డదారులు’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘వీకెండ్ పార్టీ’. ఆయన కొడుకు బోయ చేతన్ బాబు నిర్మిస్తున్నారు. అమరేందర్ దర్శకుడు. ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అక్షిత్ అంగీరస, రమ్య రాజ్, రమ్య నాని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఆడియో రిలీజ్ సోమవారం ఫిలిం చాంబర్లో జరిగింది.
దర్శకుడు మాట్లాడుతూ ‘నైంటీస్లో నలుగురు అమ్మాయిలు ఓ అబ్బాయిని రేప్ చేసిన ఇన్సిడెంట్ని బోయ జంగయ్య గారు నవలగా రాశారు. దాన్నే ఇప్పుడు సినిమాగా తీస్తున్నాం’ అన్నాడు. ‘ఇందులో పల్లెటూరి గురించి ఓ పాట రాశా, పాటతో పాటు సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు చంద్రబోస్. సంగీత దర్శకుడిగా సదాచంద్రకు మంచి పేరు రావాలని కోరారు మరో లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్. చంద్రబోస్ రాసిన పాటను వదులుకోకూడదని ఈ సినిమాకు కొరియోగ్రఫీ చేశా అన్నారు సుచిత్ర. రమ్య, రమ్య రాజ్, నిర్మాత చేతన్, సంగీత దర్శకుడు సదాచంద్ర తదితరులు పాల్గొన్నారు.