
చెన్నూరు, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్వెంకటస్వామికి పేదల సంక్షేమమే ముఖ్యమని కాంగ్రెస్చెన్నూరు పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణఅన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజా రమేశ్అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను మళ్లీ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
అసంపూర్తిగా ఉన్న మార్కెట్నే అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ అవగాహన లేకుండా ప్రారంభించారా అని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 8 నెలల్లోనే జోడు వాగుల దగ్గర తారు నిర్మాణం చేసింది కనిపించడం లేదా అన్నారు. నియోజకవర్గంలో సీసీరోడ్లు, డ్రైనేజీల పనులు 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. నాయకులు పాతాళ నాగరాజు, చెన్నూరి శ్రీధర్, ఈర్ల నారాయణ, అన్వర్, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, పెండ్యాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.