నాకు, నా మేనల్లుడికి రక్షణ లేదు : మమతా బెనర్జీ

నాకు, నా మేనల్లుడికి రక్షణ లేదు : మమతా బెనర్జీ
  • బెంగాల్ సీఎం మమత ఆరోపణ

కుమార్ గంజ్(బెంగాల్) :  బీజేపీ తనను, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తాము సురక్షితంగా లేమని ఆమె చెప్పారు. సోమవారం ఓ అంశం టీఎంసీని, ఆ పార్టీ అగ్రనేతల్ని కుదిపేస్తుందంటూ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.  

ఆ వ్యాఖ్యలపై ఆదివారం బాలూర్ ఘాట్ లోక్ సభ స్థానంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దీదీ’ స్పందించారు. ‘‘బీజేపీ నన్ను, అభిషేక్ ను లక్ష్యంగా చేసుకుంది. మేం సురక్షితంగా లేము. కాషాయపార్టీ కుట్రలకు మేం భయపడం. టీఎంసీ నాయకులు, పశ్చిమ బెంగాల్ ప్రజలపై కుట్ర జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని మేం కోరుతున్నాం. తన కుటుంబాన్ని, అక్రమ సంపదను కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన ఒక దేశద్రోహి ఉన్నాడు.

అతడి బెదిరింపులకు తాము భయపడం”అని తెలిపారు. దూరదర్శన్ లోగోను మార్చడంపై కూడా ఆమె స్పందించారు. ‘‘డీడీ లోగో అకస్మాత్తుగా కాషాయంలోకి ఎందుకు మారింది..?  ఆర్మీ సిబ్బంది అధికారిక నివాసాలకు కాషాయం రంగు ఎందుకు వేశారు? కాశీలో పోలీసుల యూనిఫాంను ఎందుకు కాషాయంగా మార్చారు?" అని మమత ప్రశ్నించారు.