బీజేపీ తిరగబడితే తృణమూల్ పరిస్థితి ఏంటి ?

బీజేపీ తిరగబడితే తృణమూల్ పరిస్థితి ఏంటి ?
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

హైదరాబాద్: బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని.. అదే బీజేపీ కార్యకర్తలు తిరగబడితే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏమిటో.. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సూచించారు. ఇదే పరిస్థితి ఏ మాత్రం కొనసాగినా బెంగాల్ రాష్ట్రంలో కర సేవ చేయాల్సి వస్తుందనీ ఆయన  హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ లో  బీజేపీ కార్యకర్తల పై తృణమూల్ కాంగ్రెస్ దాడులను వ్యతిరేకిస్తూ.. కరోనా నిబంధనలు పాటిస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్ష చేస్తున్నామని చెప్పారు. బెంగాల్ రాష్ట్రాన్ని బంగ్లా దేశ్ కు అప్పగించేలా పాలన చేస్తుందని ప్రజలకు చెప్పామని, రోహింగ్యాలకు, బంగ్లా దేశ్   చొరబాటుదారుల కు బెంగాల్ ను అడ్డాగా మార్చారని ఆరోపించారు. బెంగాల్లో గతంలో 3 సీట్లు మాత్రమే ఉండేవి..కానీ ఇప్పుడు 79 సీట్లలో  గెలిచామని... బెంగాల్లో బిజెపి ఇంకా విస్తరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ను రక్షించేందుకు బిజెపి జాతీయ వాదులు పని చేస్తున్నరని వివరించారు. కానీ బిజెపి నేతలు, కార్యకర్తల పై పోలీసులతో కలిసి దాడులు చేస్తున్నారని,బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు దుర్మార్గంగా వ్యవరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా దమన కాండ జరుతోందని, సీఎం మమతా బెనర్జీ ఒక రాక్షసి మాదిరిగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. సీఎం తన పేరును మమతా బేగంగా మార్చుకోవాలని బండి సంజయ్ సూచించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మమతా బెనర్జీ వ్యవరిస్తున్నారని,విదేశీ నిధుల తోను, రోహింగ్యాలు ఇచ్చిన నిధుల తో మమత బెనర్జీ ఎన్నికల్లో ఖర్చు చేసి గెలిచారని విమర్శించారు. బెంగాల్ లో బిజెపి కార్యకర్తలకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామన్నారు.