హింసాత్మక వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు: సీపీ

హింసాత్మక వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు: సీపీ

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర దేశాల్లో జరిగిన హింసాకాండకు చెందిన వీడియోలను కొందరు వాట్సాప్ గ్రూపులో పెడుతున్నారని…దీంతో నగరంలో శాంతిభద్రతల పరిస్థితికి భంగం వాటిల్లే అవకాశముందని కమిషనర్ చెప్పారు. పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. వాట్సాప్ వీడియోలు, మెసేజ్ లపై పోలీసు నిఘా పెట్టిందని వివరించారు.