వాట్సప్.. సోషల్ మీడియాలో దీని ప్రత్యేకతే వేరు. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత మెసేజింగ్ల స్పీడు బాగా పెరిగింది. ఇప్పటి వరకు కేవలం ఫోన్లు, ల్యాప్ టాప్లు, కంప్యూటర్లలోనే అందుబాటులో ఉన్న ఈ వాట్సప్ఇకపై స్మార్ట్వాచీలల్లోను అలరించనుంది. నిజమండీ.. ఈ వార్త వాట్సప్ స్వయంగా ప్రకటించింది.
ఫోన్లో చాట్చేసినట్టుగానే ఇకపై స్మార్ట్ వాచ్నుంచి కూడా వాట్సప్ మెసేజ్లకు రిప్లై ఇవ్వొచ్చని తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మొబైల్ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. గూగుల్ వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వేర్ ఓఎస్3 తో పని చేస్తున్న అన్ని రకాల స్మార్ట్వాచ్లలో వాట్సప్ సేవలు వినియోగించుకోవచ్చని ప్రకటించింది.
ఇకపై స్మార్ట్వాచ్ల్లో వాట్సప్తో నేరుగా కాల్ చేసుకోవచ్చు. ఏమోజీలు, చాట్, రిప్లై ఇలా ఫోన్లో ఏవైతే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో అన్ని చేసుకోవచ్చు. ఈ స్మార్ట్కహానీ ఇకపై మెటా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.