Good Health : ఎండాకాలంలో కుండ నీళ్లు బెస్టా.. ఫ్రిజ్ వాటర్ బెస్టా.. ఏవి తాగాలి..!

Good Health : ఎండాకాలంలో కుండ నీళ్లు బెస్టా.. ఫ్రిజ్ వాటర్ బెస్టా.. ఏవి తాగాలి..!

చాలామంది తరచుగా పార్టీలు, ఫంక్షన్లకు వెళ్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయిల్ ఫుడ్, మసాల ఐటమ్స్ తింటుంటారు. ఇతర సీజన్లో పోలిస్తే, ఎండకాలంలో మాత్రం ఆయిల్ ఫుడ్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లేదంటే డీహైడ్రేషన్ మొదలై వడదెబ్బకు గురయ్యే ప్రమాదాలు ఉంటాయి. పలుచని చారు, కారం లేని పులుసు, మజ్జిగ చారు, పెరుగుతో చేసిన ఐటమ్స్ తినాలి. దాహం లేకపోయినా, కుండలోని నీళ్లు తాగుతూ ఉండాలి. 

ఫ్రిజ్ నీటి వల్ల శరీర ఉష్ణో గ్రత పెరిగే ప్రమాదం ఉంది. మట్టి కుండలు ఉష్ణోగ్రతను బట్టి నీటిని చల్లగా ఉంచుతాయి. మట్టిలోని ఆల్కలైన్ అనేది.. నీటిలో ఆమ్లాలు చేరకుండా భద్రపరుస్తుంది. తద్వారా అసిడిటీ సమస్య దూరం అవుతుంది. కుండలో పోసిన నీటిని తాగడం వల్ల శరీర జీవక్రియలు సక్ర మంగా జరుగుతాయి. మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. 

ALSO READ :- కార్లు కడుగుతారా.. నీళ్లు వేస్ట్ చేస్తారా.. ఒక్కో ఫ్యామిలీకి రూ.5 వేల ఫైన్

మట్టి కుండలో నీటిని పోయడం వల్ల ఆ కుండలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ నీటిలో కలుస్తాయి. కనుక ఆ నీటిని తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టీరియా, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అందుకే మట్టి కుండల్లో వండే ఆహారం తీసుకుంటే గ్యాస్ట్రిక్, సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. ఫ్రిజ్ నీళ్ల కంటే.. కుండ నీరు బెటర్ అని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి.