రూ.100 నోటుపై ఉన్న పర్వతం పేరు తెలుసా.. దాన్ని ఎక్కడ్నుంచి తీశారంటే..

రూ.100 నోటుపై ఉన్న పర్వతం పేరు తెలుసా.. దాన్ని ఎక్కడ్నుంచి తీశారంటే..

ప్రస్తుతం భారతదేశంలో కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తోంది. మెటల్ నాణేలు లేదా కాగితం నోట్లయినా, RBI వాటన్నింటినీ జారీ చేస్తుంది. భారతీయ కరెన్సీ గురించి చెప్పాలంటే అది ఈ రోజుది కాదు. దానికి దాదాపు 2వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలో నాణేలు ఎప్పట్నుంచో ఉన్నా.. నోట్లు మాత్రం ఆ తర్వాతే వచ్చాయి. ఇప్పుడున్న ఇండియన్ కరెన్సీని గనక పరిశీలిస్తే చాలా మార్పులు కనిపిస్తాయి.

భారతదేశంలోని అన్ని నోట్లపై గాంధీజీ చిత్రాన్ని ముద్రించి ఉండడం అందరికీ తెలిసిన విషయమే. 1969లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లపై గాంధీ చిత్రాన్ని మొదటిసారిగా ముద్రించింది. ఈ ఫొటో బర్త్ సెంటెనరీ మెమోరియల్ డిజైన్. ఈ ఫోటోలో వెనుక వైపున సేవాగ్రామ్ ఆశ్రమం కూడా ఉంటుంది. ఇంతకు ముందు ఈ నోట్‌పై అశోక స్తంభం చిత్రం ఉండేది. అయితే రూ. 100 రూపాయల నోటుపై కనిపించే పర్వతం ఏ పర్వతం ఫోటో అనేది చాలా మందికి తెలిసి ఉండదు.

ఏ పర్వతం ఫొటో అంటే..

చాలా మందికి ఈ విషయం గురించి అంతగా తెలియకపోవచ్చు. రూ. 100 నోటుపై ప్రపంచంలోనే మూడవ ఎత్తైన పర్వత శిఖరమైన కాంచన్‌జంగా అనే పర్వతం. ఈ ఫొటో భారతదేశంలోని అత్యంత అందమైన, చిన్న రాష్ట్రమైన సిక్కింలోని పెల్లింగ్ నుంచి తీసుకున్నారు.

కాంచన్‌జంగా పర్వతం

కాంచన్‌జంగా పర్వతాన్ని నేపాలీ భాషలో కాంచన్‌జంగా అని, ఇంగ్లీషులో కంచన్‌జాఘా అని, లింబు భాషలో సేవాలుంగ్మా అని పిలుస్తారు. ఈ పర్వతం భారతదేశంలోని సిక్కిం రాష్ట్రానికి వాయువ్యంగా నేపాల్ దేశ సరిహద్దులో ఉంది. అంతే కాదు కాంచన్‌జంగా ప్రపంచంలోనే మూడవ ఎత్తైన పర్వతం. ఇది 8,586 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది హిమాలయ పర్వత శ్రేణిలో భాగం కూడా.