మెట్రోకు కరెంట్​ చార్జీల పెంపుపై హైకోర్టులో వాదన

మెట్రోకు కరెంట్​ చార్జీల పెంపుపై హైకోర్టులో  వాదన

హైదరాబాద్, వెలుగు: డిస్కమ్​లకు అప్పిలేట్​ అథారిటీ ఉండగా.. నేరుగా కోర్టుల్లో కేసు వేయడం చెల్లదని డిస్కమ్​లు వాదించాయి. ఒప్పందానికి వ్యతిరేకంగా మైట్రో రైల్​ ప్రాజెక్టుకు కరెంట్​ చార్జీలు పెంచుతూ విద్యుత్‌‌ రెగ్యులేటరీ కమిషన్‌‌ (టీఎస్‌‌ఈఆర్‌‌సీ) తీసుకున్న నిర్ణయంపై ఎల్‌‌ అండ్‌‌ టీ (మెట్రో రైల్‌‌) లిమిటెడ్‌‌ వేసిన రిట్​పై విచారణను హైకోర్టు మంగళవారం కొనసాగించింది. అగ్రిమెంట్​ను కాదని కరెంట్​ చార్జీలు ఎందుకు పెంచారో చెప్పాలంటూ టీఎస్‌‌పీడీసీఎల్​ను హైకోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. కౌంటర్​ దాఖలు చేయాలంటూ నోటీసులూ ఇచ్చింది. ఈ క్రమంలోనే డిస్కమ్​ల తరఫు లాయర్​ హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే, గతంలోని అగ్రిమెంట్‌‌ను ఉల్లంఘించడంపైనే కోర్టుకు వచ్చామని, విద్యుత్‌‌ చార్జీల పెంపుపై అప్పిలేట్‌‌ అథారిటీలో సవాల్‌‌ చేస్తామని ఎల్‌‌ అండ్‌‌ టీ లాయర్‌‌ చెప్పారు.